Breaking News

దూసుకుపోతున్న చైనా కు ముకుతాడు వేసి బిగించక పోతే ప్రమాదమే


6. భారతీయ మార్కెట్లలో ఆట బొమ్మలు మనవి 80శాతం వుండేవి. ఇప్పుడు చైనా నుండి 60శాతం,ఇతర దేశాల నుండి 20 శాతం వస్తున్నాయి. వేలాది ఆటబొమ్మల ఫ్యాక్టరీలు మూలన పడి లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. పైగా రసాయనాలు కలిపిన బొమ్మలు చైనా అమ్ముతున్నది. మన చిన్న పిల్లలు అవి నోట్లో పెట్టుకొని ఆడుతుంటే ఏమి అవుతుందో ఊహించండీ. కారు ఆట బొమ్మ కు వెనక వుండే కాయిల్ లు,కాపర్ వైర్లు కూడా చైనా నుండి వస్తున్నాయి.
7. గతం లో చైనా నుండి దీపావళి టపాసులు వచ్చి ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయో? ప్రభుత్వం నిషేధించినా కూడా దొంగ చాటుగా డంపింగ్ చేస్తున్నది.
8. బ్లడ్ క్యాన్సర్,ఎయిడ్స్ వంటి రోగాలకు మందులు తయారు చేయటం లో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఆఫ్రికన్ దేశాల్లో నాణ్యమైనవిగా, సరసమైన ధరలకు మందులను అమ్మే మంచి పేరు వుంది. కాని చైనా దొంగతనంగా నాసిరకం మందులు తయారు చేసి ప్యాకట్లపై made in india లేబుల్ వేసి ఎక్కువ ధరకు ఆఫ్రికన్ దేశాల్లో అమ్ముతున్నది. విలువలు దిగజార్చి చైనా ఏ స్థాయి లో వ్యవహరిస్తుందో చూడండి.
చైనా విస్తరణ వాదానికి హద్దులు లేవా?
9. మన దేశం లోని ఫార్మాస్యుటికల్ రంగాన్ని దెబ్బ కొట్టి మార్కెట్ ని ఆక్రమించి ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విటమిన్ ఫాలిక్ యాసిడ్ ని తయారు చేసే పరిశ్రమ లను మూసి వేయించే పనిలో భాగంగా కిలో కి మన కంటే తక్కువ 4,500 రూపాయలకు అమ్మి, మన పరిశ్రమలు అడ్రెస్ లేకుండా పొయిన తరువాత అదే మందును కిలో కి 50,000 చొప్పున అమ్ముతున్నది.
10. అ)ఆఫ్రికన్ దేశాల్లో 60శాతం వనరులు చైనా చేతుల్లో వున్నాయి.ఆ) 70శాతం మౌలిక వసతుల నిర్మాణం ఆ దేశాల్లో చైనానే చేపట్టింది. ఇ) ఆ దేశాల్లో
చైనా నగరాలను నిర్మించి 25 లక్షల మంది చైనా పౌరులను ఆ దేశాలకు తరలించింది.ఈ) ఆఫ్రికన్ దేశాల మహిళ లను వివాహాలు చేసుకుంటున్నారు. తద్వారా రాజకీయంగా ఆక్రమణ కోసం వ్యూహం సిద్దపరుచుకున్నారు. సుమారు 20 కోట్ల మంది చైనీయులని తరలించాలని వ్యూహం.

11. మన సమీప దేశాలకు నేపాల్ బంగ్లాదేశ్, మయన్మార్,శ్రీలంక లకు అధిక మొత్తం లో ఆర్థికంగా అప్పులు ఇచ్చి మళ్లీ చెల్లించలేని స్థితిలో వున్న ఆ దేశాల్లో సైనిక నిఘా వ్యవస్థ కోసం భూములు సేకరించింది.
12. శ్రీలంకలో తమిళుల ఉచకొత కు ఆయుధాలు సరఫరా చేసింది.
13. సుడాను లోని 2లక్షల పౌరులను చిత్ర హింసల పాల్జెసింది.
14. లాటిన్ అమెరికా దేశాలు,బ్రెజిల్ దేశం లో కూడా తన ఆర్థిక పంజాను జాపింది.
15. హిందూ మహా సముద్రంలో మైనింగ్ పేరుతో సైనికులను మోహరించింది.
చైనా అంటేనే.. పౌరుల అవయవాలతో లాభాలు గడించే నరరూప రాక్షసి, పర్యావరణ విధ్వంసి,మానవత్వాన్ని మంట కలిపే రక్త పిపాసి,ప్రపంచ శాంతిని వెక్కిరించే హింసోన్మాది,యుద్దానికి కాలు దువ్వుతున్న యుద్దోన్మాది.
16. చైనా నుండి పారిపోయి అమెరికా శరణు చొచ్చిన ఒక డాక్టర్ అమెరికా సెనేట్ ఉప సమితి ముందు బయట పెట్టిన విషయాలు వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రతి సంవత్సరం 3000 మందిని నేరారొపణ చేసి మరణ శిక్ష విధించి, తుపాకీ తో పేల్చి, గుండె కొట్టుకుంటున్నప్పుడె వాళ్ల చర్మాన్ని వొలిచి,దానిలో వుండే కొలాజిన్ అనే పదార్థాన్ని తీసి సౌందర్య సాధనాల్లొ కలిపి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేస్తారూ అంటే అమానుషం కాదూ?
17. ఆసియా మౌలిక వసతులు పెట్టుబడుల బ్యాంక్ లో అధిక వాటా కలిగి ఆసియా దేశాలపై ఆధిపత్యం చేస్తున్నది.
18. సుమారు 65దేశాలను కలుపుతూ ఒక బెల్ట్,ఒక రోడ్ నిర్మాణం జరుపుతున్నది. రోడ్,నౌకా,రైలు మార్గం కలిపి చేస్తున్న ఈ నిర్మాణం ఆయా దేశాల మార్కెట్లను ఆక్రమించడమే ప్రధాన ధ్యేయం.ఆ మార్గం లో టోల్ రుసుము చైనా యే వసూలు చెస్తుంది.
19. 1949లో చైనా లో నూతన కమ్యూనిస్ట్ ఏర్పడినప్పటి నుండి భారత్ పై అన్ని వైపులా పరోక్ష యుద్దాన్ని నడుపుతున్నది. చైనా చెస్తున్న తప్పిదాలను అప్పటి మన హోం మంత్రి సర్దార్ పటేల్జీ ఒక లేఖ ద్వారా ఎత్తి చూపినా, ఇప్పటి వరకు అదే ధోరణి...
20. 1949లో భూటాన్ తమ దేశపు రక్షణ మరియు విదేశీ వ్యవహారాలకు భారత్ ను ప్రొటెక్టర్ గా కోరింది. బౌద్ద లామాలు కూడా అప్పటి ప్రధాని నెహ్రూకి నచ్చ చెప్పారు. కాని నెహ్రూ, చైనాను ప్రొటెక్టర్ గా ఉంచుకొవాలని సూచించారు.దాని ఫలితంగా ఇప్పటికీ భూటాన్ లో మానవ హక్కులను అణిచివేస్తున్నారు
21. చైనా తో మనం పంచశీల ఒప్పందం చెసుకుని,మానస సరొవరం వెళ్ళే దారిలో తపాల,కమ్యూనికేషన్ సౌకర్యాలు మనమే ఉపసంహరించుకుని యాత్రా కాలంలో ఇబ్బందులు పడుతున్నాం.
22. చైనా తమ దేశపు వ్యాపారులకు 18 ట్రిలియన్ డాలర్ల మేరకు రుణాలిచ్చి ప్రపంచ దేశాల్లో వ్యాపార విస్తరణకు స్వేచ్ఛనిచ్చింది.
24. బ్రహ్మపుత్ర నది నీళ్లు మన దేశంలో ప్రవేశించకుండా అడ్డంగా పవర్ ప్రాజెక్ట్ లు నిర్మిస్తున్నది.
25. జమ్మూ కాశ్మీర్ ను భారత్ లో భాగం కాదని, వీసా లేకుండా పౌరులను పంపుతున్నది.
25. తనకు సంబంధం లేకున్నా పాకిస్తాన్ తీవ్రవాదులను ఇంటర్నేషనల్ టెర్రరిష్టులుగా ప్రకటించకుండా వీటొ చేసి అడ్డు తగులుతున్నది.

26.పరిశ్రమల ద్వారా ఇతర పనుల ద్వారా కార్బన్ డై ఆక్సైడ్ ను 50 శాతం వదిలిపెట్టి ఉష్ణోగ్రత ను పెంచుటున్నది.ఫలితంగా వాతావరణం లో 1.5 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది.ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద మంచు కరిగి దేశాలు జల ప్రళయం లో చిక్కు కునే ప్రమాదం కొని తెస్తున్నది.
27. సంవత్సరం లో 400 సార్లు సరిహద్దు దాటుతూ బంకర్ల ను టవర్లను కూల్చటం నిత్య కృత్యంగా మారింది.
28. 1962లో దొంగ చాటుగా యుద్దానికి దిగి 3000సైనికులను హతమార్చి,38వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించి, భారతే తమ 1,04,000చదరపు కిలోమీటర్ల భూమిని తీసుకున్నదని విశ్వ వేదికల పై అబద్దాలు ప్రచారం చేస్తున్నది.
29. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ లో తవాంగ్ జిల్లా లో పర్యటన చేయనున్నాడని తెలిసి చైనాలోని భారత దౌత్యాధికారి మహిళ అని చూడకుండా రాత్రి 2 గంటలకు లేపి,పిలిచి హెచ్చరించడం జరిగింది.

మానవ హక్కుల భక్షకుడు, పర్యావరణ విధ్వంసకుడు, మార్కెట్లో వస్తువుల డంపింగ్ తో సామ్రాజ్య వాదాన్ని విస్తరించే నియంత...ఇలా చైనా కేవలం భారత్ కే కాదు ప్రపంచానికి ప్రమాద కారి. చైనా వస్తువులను స్వదేశీ డైనమెట్ తో పేల్చేద్దాం. బహిష్కరణ చేద్దాం.
- అప్పాల ప్రసాద్ గారు.

1 comment:

  1. ఇలా స్వదేశీ అన్ని వేళల్లో అన్ని దేశాల్లో వికాసానికి ప్రతీక యని మనం భావించాలి.

    ReplyDelete