Breaking News

ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం మహాత్మా గాంధీచే ప్రారంభింపబడిన ఒక అహింసా ప్రచారోద్యమం, ఇది బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగినది. ఉప్పుపై పన్ను చెల్లించుటకు నిరాకరించి, మార్చి 12, 1930 న చేపట్టిన "దండి యాత్ర" నే ఉప్పు సత్యాగ్రహంటారు. సంపూర్ణ స్వరాజ్యం కొరకు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమాల సరమే ఈ ఉప్పు సత్యాగ్రహం. ఈ యాత్ర సబర్మతీ ఆశ్రమం నుండి ప్రారంభమై దండి వరకూ సాగింది. ఈ యాత్రలో వేలకొద్దీ భారతీయులు పాల్గొన్నారు. గాంధీగారి అహింసా మార్గంపు విజయాలలో ఇదొక పుష్పమాలిక. కోట్ల భారతీయులపై బ్రిటిష్ వేసే ఉప్పు-పన్నుకు వ్యతిరేకంగా ఒక మౌనగళం.


ఈ సత్యాగ్రహం ప్రారంభానికి కొన్నిరోజులకు ముందే బ్రిటిష్ వారు గాంధీని మార్చి 5, 1930 న అరెస్టు చేశారు. ఈ ఉప్పుసత్యాగ్రహం గురించి ప్రపంచానికి తెలిసినపుడు, ప్రపంచం దృష్టియంతా ఈ సత్యాగ్రహం వైపున ఆసక్తిగా వుండినది. ఈ సత్యాగ్రహం దాదాపు ఒక సంవత్సరకాలం వుండినది. మహాత్మాగాంధీని జైలునుండి విడుదల చేశాక, వైశ్రాయ్ అయిన లార్డ్ ఇర్విన్ తో రెండవ రౌండ్ టేబుల్ సమావేశం సంభాషణలు మొదలయ్యాయి. ఈ సత్యాగ్రహం మూలంగా దాదాపు 80,000 వేలకు పైగా భారతీయులు కారాగారాల పాలయ్యారు. ఈ ఉద్యమం బ్రిటిష్ రాజ్య అరాచక విధానాలు తేటతెల్లమైనాయి.మరియు లక్షలకొద్దీ భారతీయులు స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యారు.

జై హింద్.

No comments