Friday, April 13, 2018
Saturday, March 3, 2018
7:07 PM
Sainadh Reddy
Documentaries, Videos
1 comment
Monday, February 26, 2018
9:32 PM
Sainadh Reddy
Info, Whatsapp Groups
1 comment
దేశభక్తి గీతాలు మరియు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రల కొరకు ఈ గ్రూపులో చేరండి...
మీ స్నేహితులకు ఈ లింక్ ను పంపండి.
Friday, February 23, 2018
Saturday, February 17, 2018
7:54 PM
Sainadh Reddy
Inspirational Talks, Inspiring
1 comment
Thursday, February 15, 2018
7:32 PM
Sainadh Reddy
Articles, Narasimha Murthy, RSS
1 comment
స్వతంత్రం రాగానే కాంగ్రెస్ వారు ఇంగ్లీషు వాడి విభజించు పాలించు పద్ధతినే మార్గం గా స్వీకరించి ముస్లిములను విడగొట్టి మైనారిటీ ప్రత్యేక హక్కులు అంటూ ఆ కూటమిని దృఢతరం చేసి ఓటుబాంకు తమదిగా చేసుకోవడానికి ప్రయత్నం చేసారు. నిజానికి ముస్లిం లీగ్ తో విభజింప బడిన దేశం లో ముస్లిములు వేరు పార్టీ పెట్టి మనగలగడం కష్టం గా భావించి కాంగ్రెస్ లో కలసి జాతిలో ముసలం కాకూడదని భావించి ఉంటారు.
కాని కాంగ్రెస్ వారిని బలమైన కూటమిగా తయారు చేయడం ఒకింత స్వాంతన పొంది కాంగ్రెస్ కి మంచి ఓటు బాంకు గా తయారై తమ కోరికలను ఒత్తిడి తెచ్చి కాంగ్రెస్ తొ పూర్తి చేసుకుని, జాతీయత లో మమేకం కావడంకంటే వేరుగా ఉంటేనే లాభదాయకమని అలా ఉండటం తమ శక్తిని మత శక్తి గా ఎదుగుతూ వచ్చింది.
అయితే మన దురదృష్టం ఏమిటంటే కాంగ్రెస్ జాతీయత గురించి దృఢంగా ఆలోచించే తిలక్ అస్తమయం, నేతాజీ యుద్దం చేయడానికి దేశం వదిలి తిరిగి రాజకీయం లోకి రాకపోవడం. పటేల్ స్వతంత్రం తరువాత కొద్ది కాలమే మన ఉప ప్రధానిగా ఉండటం, త్వరగా స్వర్గస్తులు కావడం నెహ్రు తప్పుడు అడుగులకు అడ్డుపడటం ఎవరికీ చేత కాలేదు. అందులో ప్రజలు కూడా స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం ని సహకరించాలనే భావం దేశం లో ఉద్యమాలు చేయ లేదు.
అప్పటిలో కమ్యునిష్టులు మినహా మరో ప్రతిపక్షం లేదు. వారూ అంత బలమైన పార్టీ కాదు. కొద్ది చొట్ల మాత్రమే వాటి బలం ఉన్న కారణం గా నెహ్రు విభజించి పాలించు, జాతీయత నిర్మాణం కంటే జాతిని ముక్కలుగా విడగొట్టడాన్ని అభివృద్దికి మార్గం అనీ, దానికి కొత్త పేర్లు వెతికి సోషలిజం, సెకులరిజం లాంటివి ప్రయోగించి వ్యతిరేకతలు బయట పడకుండా హిందువులను కులం ఆధారంగా సామాజిక ఆరక్షణలు అంటూ జాతీయతను ప్రక్కనపెట్టి కుల సమీకరణాలు చాలా ముఖ్యమై కూటములు, ఓటు బాంకు నిర్మాణం చేసి హక్కులు సాధించడానికి ఇచ్చిన శ్రద్ధ జాతీయ శక్తిలో అంతర్భాగము కావాలనే తలపు ప్రజల్లో లేకుండా వాతావరణం నిర్మాణం కాంగ్రెస్ ద్వారా జరిగింది.
మరి దీనికి వ్యతిరేకంగా గొంతు విప్పింది రాష్ట్రీయ స్వయంసేవక సంఘంమాత్రమే రేపు ఆ విషయాలు వ్రాస్తాను.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
7:30 PM
Sainadh Reddy
Narasimha Murthy
1 comment
మాన్యులు శ్రీ దెందుకూరి శివప్రసాద్ గారు ఈ రోజు స్వర్గస్తులయ్యారు. పూర్వాంధ్ర స్వయంసేవకులకు చిరపరిచితులు. నిరంతర పర్యటన చేస్తూ కార్యకర్తలతొ గరిష్ట సంబంధం కలిగిన సీనియర్ కార్యకర్త. శ్రీ రాజేంద్ర, సంఘ ప్రచారకులు వారి గూర్చి రండు సంఘటనలు చెప్పారు. మీరూ వినండి
ఒకసారి ఎలమంచిలి పర్యటన ముగించి విశాఖ బయలుదేరుతూ బస్సు ఎక్కారట. స్థానిక స్వయంసేవక్ తనూ రేపు ఆంధ్రా యునివర్సిటీ వస్తాను. ఒక యం ఎ సంస్కృతం కి అప్లికేషన్ కొరకు అన్నారట. ఎందుకు నేను పంపిస్తానులే. దానికోసంఅంత దూరంఎందుకు అని శివప్రసాద్ గారు అన్నారట. వారు యూనివర్సిటీ లో లెక్చరర్. ఏదో వారు అన్నారు. జ్ఞాపకం ఉంటందా? అనుకున్నారు. కాని మూడవ రోజు పోస్టులో వచ్చింది.
స్వయంసేవకుల పనిని అంత శ్రద్ద గా పట్టించుకోవడం వారి నుండి నేర్చుకోవాలి అంటాడు, రాజేంద్ర.
ఒకరోజు శ్రీకాకుళం లో మాననీయ మజ్జి నరసింహం గారి ఇంట్లో భోజనం చేసి ఐదవ తరగతిచదివేవాళ్ల అమ్మాయి కి భారతం కథలో కౌరవులు నూరు మంది అని చెబుతుంటే, ఆమె అడ్డువచ్చి వాళ్ళ పేర్లున్నాయా? అని అడిగిందట. ఇప్పుడు నేను చెప్పలేను కాని, నీకు పంపిస్తాను అన్నారట. అమ్మాయి సరే అంది. విశాఖ వెళ్ళాక ఆ నూరు పేర్లు, చెల్లెలు దుస్సల పేరు కలిపి పెద్ద ఉత్తరం వ్రాసారట. ఆమె ఇప్పుడు ఖరగ్పూర్లో ఉంటూంది. ఆమె కొడుకు ఇదే ప్రశ్న వేస్తే ఆమె దాచుకున్న ఆ ఉత్తరం చూపి వాళ్ళ పేర్లు చెప్పిందట.
సంఘం లో కార్యకర్తల కుటుంబాల మధ్య తర తరాలుగా సంబంధం కొనసాగడం అంటే ఇదే. మధుమేహం ఎక్కువయ్యి వారి దృష్టి మందగించి ఈ మధ్య పర్యటన ఆగింది. వారు పర్యటించిన ప్రతీ ఊరు, అందులో స్వయంసేవకుల పేర్లు, వారి వివరాలు ఆలొచిస్తూ ఈ మధ్య మానసిక పర్యటన చేస్తూ తన 83 ,వ ఏట వారు హార్ట్ అటాక్ తో వారి స్వగృహం లొ ఉదయం _11.00 గంటలకు స్వర్గస్తు లయ్యారు.
నమస్సులతో మీ నరసింహ మూర్తి.
Subscribe to:
Posts (Atom)