Breaking News

సుప్రీం కోర్టు


భారత దేశములోని అత్యున్నత న్యాయస్థానము సుప్రీం కోర్టు. ఇది ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ. ఇది హైకోర్టు లేదా ఉన్నత న్యాయస్థానములపై నియంత్రణాధికారం కల్గిఉన్నది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాపైననే రాష్ట్రపతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, ఇతర న్యాయమూర్తులను నియమిస్తాడు. ఇందులో 26 మంది జడ్జీలు ఉంటారు ప్రధాన న్యాయ మూర్తితో కలిపి. ఈ కోర్టులలో భారత ప్రభుత్వానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను భారత ప్రభుత్వం, ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఒక వైపు ఒకటి లేదా కొన్ని రాష్ట్రాలు ఇంకొక వైపు ఉన్నప్పుడు వాటి మధ్య తగాదాలను రెండు అంత కంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య తగాదాలను పరిష్కరిస్తుంటాయి.

ఇందులో సివిల్ కేసు అయినా, క్రిమినల్ కేసు అయినా, ఇతర ఏ కేసు అయినా హైకోర్టు‌లో జరుగుతూ ఉన్నా, ఆఖరి తీర్పు అయిపోయినా మనము ఈ కోర్టు‌లో (న్యాయస్థానంలో) ఫిర్యాదు చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవీ అర్హతలు:

భారతదేశ పౌరుడై ఉండాలి.

కనీసం 5 సంవత్సరాల కాలం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి.లేదా 10 సంవత్సరాలు హైకోర్టులో అడ్వకేట్ వృత్తి నిర్వహించి ఉండాలి లేదా ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త అయి ఉండాలి.

ప్రస్తుత ప్రథాన న్యాయమూర్తి H.L.దత్తు.

1 comment:

  1. భారత సుప్రీంకోర్టు నెలకొల్పబడింది ఈ రోజే 1935 అక్టోబర్ 1.

    ReplyDelete