Breaking News

వీర్ సావర్కర్ జీవిత చరిత్ర-Veer Savarkar Life Story in telugu

2 వ భాగం

వీర సావర్కర్ జననం నుండి మరణం వరకు క్షణం క్షణం.. కణం కణం దేశ మాత కే సమర్పణం.
జననం 1883 మే 28,సోమవారం ఉదయం 10 గంటలకు నాసిక్ లో...
తల్లి మరణం... 1892 జులై లో..
12 సంవత్సరాల వయసులో మొదటి మరాఠి పాట వ్రాశాడు ..
1898లో చేసిన ప్రతిజ్ఞ.." ఐతే ఛాపేకర్ సోదరుల వలె బలిదానం లేదా ఛత్రపతి శివాజీ వలె హిందూ సామ్రాజ్య ప్రతిష్ఠాపన చేస్తాను ...
తండ్రి , పిన తండ్రి ప్లేగు వ్యాధి సోకి మరణం 1899లో ...
స్వాతంత్య్రం కోసం రహస్య సంస్థ 'మిత్ర మేళా' ప్రారంభం 1901లో ,....
1902 లో 10th పాస్....
'ఆర్యన్ వీక్లీ' కొత్త పత్రిక ప్రారంభం 1903లో,
పద్యాల రచన...1.శివాజీ హారతి పాట 2.స్వాతంత్య్ర రూపక గీతం
1904 లో రహస్య మిత్ర మేళాను అభినవ భారత్ గా మార్పు,...
విదేశీ వస్త్రాల దహనం చేయటం సావర్కర్ కి 10 రూపాయల జరిమానా, హాస్టల్ నుండి తొలగింపు, పుత్రుడు జననం,ప్రభాకర్ నామధెయం(1905).
LLB చదువుల కోసం పుణే ప్రయాణం బిహారీ అను పత్రికకు ఎడిటర్ గా నియామకం (1906).
బాల గంగాధర్ తిలక్ సలహా తో శ్యాంజి క్రిష్ణ వర్మ ఇచ్చే స్కాలర్ షిప్ తో విదేశాల్లో చదువు(1906 మే).
భారత్ వదలి ఇంగ్లాండ్ ప్రయాణం,పడవలొనే 'మహాసాగర్'పద్య రచన(9 జులై).
ఇటలీ దేశ స్వాతంత్య్రం కోసం పొరాడిన మెజినీ యుద్దవీరుడి కథా రచన(జులై - సెప్టెంబర్).
శివాజీ అనుచరుడైన బాజీ ప్రభు దేశ పాండే పై రూపకం రచన...
తన ప్రేరణతో మదన్ లాల్ ధింగ్రా అను యువకుడు లండన్ వెళ్లి కర్జన్ వైలీని హతమార్చాడు(జులై).
జైలులో వున్న ధింగ్రా ను కలిసి వచ్చాడు(జులై 22),ధింగ్రా కు మరణశిక్ష (ఆగష్ట్ 11), మహాత్మా గాంధీ సమక్షంలో విజయదశిమి రోజున ఉపన్యాసం (అక్టోబర్ 24),
తన ప్రేరణతో అనంత లక్ష్మణ కన్హరే అను యువకుడు 'జాక్శన్' ఇంగ్లీష్ అధికారిని చంపివెసాడు(డిసెంబర్ 21).
లండన్ లో ప్రధమ స్వాతంత్య్ర పోరాటం1857, 50 సంవత్సరాల ఉత్సవాలు,
లండన్ లోని ఇండియా హౌస్ నిర్వహణ బాధ్యత.
బాంబుల తయారీ వివరాల సేకరణ
(1907)
1857 స్వాతంత్య్ర పోరాటం చారిత్రక పుస్తక రచన. విప్లవ వీరులకు ఇది భగవద్గీత.ఈయన పుస్తకం చదివిన వారిని 15 సంవత్సరాలు మరియు అండమాన్ జైలు
లండన్ లో శివాజీ జయంతి ఉత్సవాలు జరిపాడు.
"1857 స్వాతంత్య్ర పోరాట గాథలు'పుస్తకం ఇంగ్లీష్ లోకి అనువాదం.
21బ్రొనింగ్ పిస్టల్ లు ఒక వంట మనిషి ద్వారా భారత్ కి పంపించారు.
పుత్రుడు ప్రభాకర్ మరణం,పెద్దన్నయ్య గణేశ్ సావర్కర్ ని అండమాన్ జైలుశిక్ష (ఆజీవన కారాగారము) విధించి,పంపారు. (1909)
తీవ్ర అనారోగ్యం కారణంగా విశ్రాంతి కోసం ప్యారిస్ ప్రయాణం(1910)
ప్యారిస్ నుండి తిరుగు ప్రయాణం లో లండన్ లో అరెస్ట్ అయ్యాడు (మార్చ్13).
జులై 1 న మొరియా స్టీమరులో భారత్ ప్రయాణం..
జులై 18న సముద్రంలో దూకి,ఈది ఫ్రాన్స్ సరిహద్దులు చేరి మళ్ళీ అరెస్ట్ అయ్యాడు.
జులై 22 నాసిక్ , ఎరవాడ జైళ్లో పెట్టారు.
డిసెంబర్ 24 ఆజీవన కారాగార శిక్ష విధించి అండమాన్ జైలుకి పంపారు.ఆయన ఆస్తుల్నీ జప్తు చేశారు.
1911, జనవరి 31 రెండవసారి ఆజీవన కారాగార శిక్ష పడింది.జులై 4 అండమాన్ సెల్యులర్ జైల్ కి తీసుకుని వెళ్ళారు.
1918 లో అనారొగ్యానికి గురయ్యారు.
1919 ఎప్రిల్ లొ సావర్కర్ వదిన యశువాహిని మరణం
మే లో తమ్ముడి భార్య మాయి వచ్చి కలిసింది.
1921 రంగస్వామి అయ్యర్ కౌన్సిల్ లో సావర్కర్ అనారోగ్యం గురించి లేఖ వ్రాసి విడుదల చెయమన్నారు.
1922 హిందూత్వ అను సైద్దాంతిక పుస్తకం వ్రాశారు.
1923 ఎరవాడ జైలు కి పంపారు.
1924 లో విడుదల,రత్న గిరి జిల్లా దాట వద్దని నియమాల తో కూడిన బెయిల్ తో విడుదల చేశారు.
1924 మహరాష్ట్ర తరఫున 12000రూపాయలు సమర్పించారు.
1925 న కూతురు పుట్టింది. ప్రభ అని పేరు పెట్టారు.
జనవరిలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టాడు. హిందూ గణేష ఉత్సవాలు ప్రారంభం చేశాడు.
1926 లో 'శ్రద్దానంద' పత్రికలో వ్యాసాలు వ్రాయటం మొదలయ్యింది.
1927 లొ మహాత్మా గాంధీ సావర్కర్ ని కలవడానికి రత్నగిరికి వచ్చారు.
అంటరానితనం నిర్మూలన పై నాటకం వ్రాశాడు. 1910 నుండి 1921వరకు అండమాన్ జైల్లో పడ్డ యాతనలు వివరిస్తూ పుస్తకం వ్రాశాడు.
1928 కొడుకు విశ్వాస్ జననం.
1930లో సామూహిక భోజనాలు 1931 లొ పతిత పావన మందిరం నిర్మించారు. ఆ గుడిలో అన్ని వర్గాల వారికి ప్రవేశం కలిపించబడింది.
1932 లొ ఎవరిదో హత్య గురించి అనుమానం తో మళ్ళీ అరెస్ట్. 1937హిందూ సభ కు అధ్యక్షుడిగా ఎంపిక.1937 న జైలు నుండి విడుదల. ఆయన వ్రాసిన 'కాలాపానీ' పుస్తక ప్రచురణ జరిగింది.
1938 మరాఠీ సాహిత్య సమ్మేళనం అధ్యక్షుడిగా ఎన్నిక. హిందూత్వ గురించి దేశమంతటా పర్యటన.
అక్టోబర్లో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్య సమాజం చేసె ఉద్యమాన్ని సమర్ధిస్తు భాగ్యనగర సత్యా గ్రహం ప్రసంగం పుణే లో ఇచ్చారు.
కలకత్తా,మద్రాస్ బీహార్, అమృతసర్ , నాగపూర్,బిలాస్ పూర్ పర్యటన.
1945 లొ అన్న గణేశ్ సావర్కర్ మరణం
మే 28 న 68వ పుట్టిన రోజు సందర్భంగా హిందూత్వ కార్యక్రమాలకు 50000 రూపాయలు నిధి సమర్పణ.1946 లో సావర్కర్ వ్రాసిన పుస్తకాలపై బ్రిటిష్ ప్రభుత్వం విధించిన నిషేదం ఎత్తివేత.
1947 లో స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం చెపుతూ జాతీయ జెండా తో పాటు భగవా ఝండా ఎగరెసారు. స్వాతంత్య్ర లక్ష్మీ కి జయ్ అంటూ నినాదం ఇచ్చాడు.
1948 ఫిబ్రవరి లో గాంధీజీ హత్యకు సంబంధం లేకున్నా మళ్ళీ అరెస్ట్.1949 మే 10 న విడుదల
అక్టోబర్ 19 తమ్ముడు్ నారయణ సావర్కర్ మరణం
1950 లో మళ్ళీ అరెస్ట్ (లియాఖత్ చర్చల పేరుతో).
1952లో 10-12 మే లో విప్లవ వీరుల స్మృతి కి చిహ్నంగా దేశం లోనే మొదటిసారి పూణె మునిసిపాలిటీ స్మారక స్తంభం స్థాపన.
డిసెంబర్ లో ప్రసంగం 'మతం మారితే జాతీయత ను కూడా మార్చుకున్నట్లె 'అని.
1954 లొ క్రైస్తవుల నుండి హిందు మతంలొకీ శుద్ది కార్యక్రమం ద్వారా హిందువుల పునరాగమనం ఏర్పాట్లు.
1962 మహారాష్ట్ర గవర్నర్ ద్వారా సావర్కర్ ఇంట్లోనే సన్మానం
1963 లొ 'చరిత్ర లో ఆరు స్వర్ణ పుటలు' పుస్తకం ప్రచురణ
1965 పాకిస్తాను యుద్దం లో భారత సైన్యం లాహోర్ చేరుకొనేసరికి అత్యంత అనందం వ్యక్తం చేశారు.

1966 ఫిబ్రవరి 1 న తీవ్ర అనారోగ్యం ఫిబ్రవరి 26 న స్వర్గవాసులయ్యారు. ఫిబ్రవరి 27 న పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి అంత్యక్రియలు నిర్వహించారు.

- అప్పాల ప్రసాద్ గారు



1 comment:

  1. 1947 లో స్వాతంత్య్ర దినోత్సవానికి స్వాగతం చెపుతూ జాతీయ జెండా తో పాటు భగవా ఝండా ఎగరెసారు. స్వాతంత్య్ర లక్ష్మీ కి జయ్ అంటూ నినాదం ఇచ్చాడు

    ReplyDelete