Breaking News

పాగ పుల్లారెడ్డి

జననం: 1919, మే 2
మరణం: 2010, అక్టోబరు 20


ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడైన పాగ పుల్లారెడ్డి 1919, మే 2న జన్మించాడు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు మరణించగా గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో విద్యాభ్యాసం పూర్తిచేశాడు. 1947-48 కాలంలో హైదరాబాదు సంస్థానం భారత యూనియన్ లో విముక్తి కావడానికి చేపట్టిన ఉద్యమంలో చేరి చురుకుగా వ్యవహరించాడు. 3 మాసాలు గౌతు లచ్చన్న నిర్వహించిన సైనిక శిభిరంలో శిక్షణ పొంది కర్నూలు ప్రాంతం డిక్టేటరుగా నియమించబడ్డాడు. విమోచనోద్యమ అనంతరం 1952లో గద్వాల-ఆలంపూర్ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనాడు. 1968లో గద్వాల పురపాలక సంఘ చైర్మెన్ గా, 1972లో గద్వాల నుంచి శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనాడు. 1984-87 కాలంలో గద్వాల వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మెన్ గా పనిచేశాడు. కళారంగానికి ఎంతో కృషిచేసి కళారంగపోషకుడిగా పేరుపొందినాడు. 198లో గద్వాలలో లలితకళాభివృద్ధి సంఘం ఏర్పాటుచేయడమే కాకుండా బాలభవన్ లాంటి సంస్థల అభివృద్ధికి పాతుపడ్డాడు. ప్రతినెల సాహితీసాంస్కృతిక కార్యక్రమం నిర్విరామంగా నిర్వహించాడు.

1 comment:

  1. ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు అయిన పాగ పుల్లారెడ్డి.

    ReplyDelete