Breaking News

హిట్లర్ తో సుభాష్ చంద్ర బోస్ చెలిమి


ప్రపంచ చరిత్రలోనే అత్యంత కౄరనియంతగా అవతరించిన హిట్లర్ తో సుభాష్ చంద్ర బోస్ చెలిమి చేసే ప్రయత్నం ఎందుకు చేశాడన్నది సమస్య.

నేతాజీ దృష్టిలో అత్యధిక ప్రాధాన్యం ఉండేది మన జాతీయ ప్రయోజనాలకే. శతృవు శతృవు మనకి మితృడని బోస్ నమ్మిన సూత్రం. మన శతృవు బ్రిటన్ మీదకి, హిట్లర్ యుద్దం ప్రకటించాడు కాబట్టి, శతృవు మెడలు వంచి, మనం స్వాతంత్ర్యాన్ని సాధించేందుకు హిట్లర్ సాయం తీసుకుంటే తప్పేమీ లేదని బోస్ తర్కం. అసలు హిట్లర్ సాయమే తీసుకోవాలనే పట్టుదలేమీ బోస్ కి లేదు. కలకత్తా నుంచి బ్రిటన్ గూడచారుల, పోలీసుల కళ్లు కప్పి తప్పించుకున్నపుడు బోస్ మొదట సోవియట్ సహాయం తీసుకోవాలనే ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యపడలేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి సోవియట్ లో ప్రవేశించాలని బోస్ చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాతే ఆయన జర్మనీ వైపు దృష్టి సారించాడు.

1942 మే 29 హిట్లర్ తో ముఖాముఖి సమావేశమైనపుడు జరిగిన సంఘటన బోస్ సాహసానికి పరాకాష్ట.

2 comments:

  1. హిట్లర్ తో సుభాష్ చంద్ర బోస్ చెలిమి

    ReplyDelete